ప్రైవేట్‌కు ఇచ్చింది ప్రభుత్వానికి ఇవ్వండి.. ప్రధానికి జగన్ లేఖ

by  |
cm-jagan mohanreddy
X

దిశ, ఏపీ బ్యూరో : ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో లేఖ రాశారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించబడలేదని.. ఈ వ్యాక్సిన్లను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని లేఖలో కోరారు. కేంద్రం పాలసీ ప్రకారం 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేట్‌ ఆస్పత్రులకు కేటాయించినట్లు గుర్తు చేశారు. అలా కేటాయించిన వాటిలో చాలా వ్యాక్సిన్లు మిగిలిపోయాయని సీఎం లేఖలో స్పష్టం చేశారు. జూలై నెలలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు 17,71,580 డోసులు కేటాయించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేట్‌ ఆస్పత్రులు వినియోగించుకునే అవకాశం లేదన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు తీసుకోనటువంటి వ్యాక్సిన్‌ నిల్వలను ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈనెల 24న జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ, ఇతర రాష్ట్రాలు ఇదే అంశాన్ని ప్రస్తావించాయని లేఖలో సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు.


Next Story

Most Viewed