ప్రధానితో భేటీ కానున్న సీఎం జగన్

by  |
ప్రధానితో భేటీ కానున్న సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ టూర్‌కు వెళ్లనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పలు ప్రాజెక్టులకు సంబంధించిన కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అంతేగాకుండా మంగళవారం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. సీఎం జగన్‌కు ఈ మంగళవారం ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి అమరావతి నుంచి పులివెందులకు చేరుకుంటారు. అక్కడ జరిగే అభివ‌ృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం… మధ్యాహ్నం 3.15 గంటలకు కడప నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.

Next Story