ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

by  |
ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యపై సీఎం జగన్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేగాకుండా విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

కరోనా వైరస్ విస్తృత వ్యాప్తి మూలంగా మూతపడ్డ కాలేజీలు అక్టోబర్ 15 నుంచి తెరుచుకోవచ్చన్నారు. సెప్టెంబర్‌లో సెట్లను నిర్వహిస్తారు. గ్రాన్ ఎన్ రోల్ మెంట్‌ను 90 శాతానికి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. మూడు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటీస్, మరో ఏడాది స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్, ఉపాది కల్పించే కోర్సులు నేర్పనున్నారు. అంతేగాకుండా ఇదే అదునుగా అక్రమాలకు పాల్పడే కాలేజీల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.



Next Story