తెరపైకి వనజీవి రామయ్య బయోపిక్

by Sujitha Rachapalli |

పద్మశ్రీ వనజీవి దరిపల్లి రామయ్య బయోపిక్ తెరపైకి రాబోతుంది. సీనియర్ నటుడు బ్రహ్మాజీ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. గ్రామీణ వాతావరణంలో చిత్రీకరణ కొనసాగుతోంది. మెదక్ జిల్లా చేర్యాల మండలం కడవేరుగు గ్రామంలో

తెరపైకి వనజీవి రామయ్య బయోపిక్
X

దిశ, సినిమా : పద్మశ్రీ వనజీవి దరిపల్లి రామయ్య బయోపిక్ తెరపైకి రాబోతుంది. సీనియర్ నటుడు బ్రహ్మాజీ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. గ్రామీణ వాతావరణంలో చిత్రీకరణ కొనసాగుతోంది. మెదక్ జిల్లా చేర్యాల మండలం కడవేరుగు గ్రామంలో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని నటీనటులకు గ్రామ సర్పంచ్ తాళపల్లి రమేష్ గుప్త సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గిరి కొండల్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. వేముగంటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు లింగంపల్లి చంద్రశేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా… బల్లేపల్లి మోహన్ సంగీతం అందిచనున్నారు. కోటి మొక్కలు నాటిన దరిపల్లి రామయ్య గారి జీవిత చరిత్ర బావి తరాలకు చేయడమే ఈ సినిమా ఉద్దేశమని తెలిపారు మేకర్స్.

Next Story