- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'స్పిరిట్' థియేట్రికల్ హక్కులు దక్కించుకున్న క్రేజీ సంస్థ
స్పిరిట్ చిత్రానికి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను మైత్రి మూవీ మేకర్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’లో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను మైత్రి మూవీ మేకర్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కారణంగా సినిమాకు ఎక్కువ స్థాయిలో థియేటర్లు దొరికే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాకు మంచి టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్పిరిట్ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందులో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటివరకు తన కెరీర్లో ఎప్పుడూ పోలీస్ పాత్ర చేయని ప్రభాస్ ఈ సినిమాలో కొత్తగా కనిపించనుండటంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.






