- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మూడు రోజులు ఎవరితో మాట్లాలేదు.. అప్పుడే నేను అంటే ఏంటో నాకు తెలిసింది.
టాలీవుడ్ బ్యూటీ సమంత (Samantha).. అటూ సినిమాలతో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక పోస్ట్తో నెటిజనులను ఆకర్షిస్తుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ సమంత (Samantha).. అటూ సినిమాలతో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఏదో ఒక పోస్ట్తో నెటిజనులను ఆకర్షిస్తుంది. ఈ క్రమంలోనే సమంత తాజాగా పెట్టిన ఓ పోస్ట్లో ‘నా చేతిలో ఎప్పుడూ సెల్ ఫోన్ (cell phones) ఉంటుంది. అయితే సడన్గా నాకో ఆలోచన వచ్చింది. దీంతో వెంటనే నా ఫోన్ను మూడు రోజులు స్విచ్ఆఫ్ చేశాను. ఆ మూడు రోజులు ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరినీ చూడలేదనీ, పుస్తకాలు చదవడం, రాయడం వంటివేవీ చేయలేదు.
అలా త్రీ డేస్ మెదడుకు పూర్తిగా విశ్రాంతినిచ్చాను. ఆ అనుభవం చాలా కొత్తగా ఉంది. అప్పుడు అర్థం అయింది.. మన లైఫ్లో చాలా భాగం ఫోనే అని. నేను ఎవరూ? ఎంత సెలబ్రిటీనీ? ఏం సాధించాను? అన్న విషయాలు ఫోనే చెబుతుంది. అది లేని రోజున నేను కూడా ఒక సాధారణ జీవినే అనే భావన కలిగింది. పుట్టుకకు గిట్టుటకు మధ్య కాలంలో సెల్ ఫోన్ మనకు, ప్రకృతికి చెందిన విషయాలను కనుమరుగు చేసింది.. మన పెద్దలకు, ఆరోగ్యానికి ఫోన్ ఎంతో ఆటంకంగా మారింది’ అంటూ సమంత పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.






