- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కించపరచడానికి ధైర్యం చేయనివాడు నిజాయితీగా ఉండలేడు’: రేణు దేశాయ్
పవర్స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్డెస్క్: పవర్స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటి సినిమాల్లో నటించే క్రమంలోనే పవన్ కల్యాణ్తో ప్రేమలో పడి.. పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు చిహ్నంగా అకీరా నందన్, ఆద్య జన్మించారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ.. పవర్స్టార్ పవన్ కల్యాణ్ అండ్ రేణు దేశాయ్ విడిపోయారు. అయినప్పటికీ పిల్లల్ని తండ్రి దగ్గరకు పంపిస్తూ.. అకీరా, ఆద్యల బాధ్యతలు చూసుకుంటోంది. ఇక రేణు రేణు దేశాయ్ వివాహనంతరం సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పెళ్లైనాక సినిమాలకు దూరమైన రేణు దేశాయ్ మాస్ మహారాజా కీలక పాత్రలో నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో లవణం పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ మూవీలో నటించింది. ఇకపోతే రేణు దేశాయ్ తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్తో నెటిజన్లను పలకరిస్తుంటుంది. చాలా వరకు అయితే జంతువులకు సంబంధించిన పోస్టులు పెడుతుంటుంది. రేణు దేశాయ్ జంతు ప్రియురాలు అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈమె ఇన్స్టా స్టోరీలో థామస్ పైన్ రాసిన ఓ మాట పంచుకుంది. ‘‘నిజాయితీగా ఉండాలంటే, కొంతమందినినొప్పించడానికైనా సిద్ధంగా ఉండాలి. ఎవరినైనా నొప్పించడానికి భయపడేవాడు నిజాయితీగా ఉండలేడు.’’. అంటూ రేణు పంచుకుంది.






