- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇందుకు కారణం మీరేనంటూ భారత సాయుధ దళాలపై మెగా కోడలు ఉపాసన పోస్ట్..

దిశ, వెబ్డెస్క్: టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె మెగా కోడలిగా బాధ్యతలు స్వీకరిస్తూ.. ఇంటిని చక్కదిద్దడమే కాకుండా.. అపోలో హాస్పిటల్స్ గ్రూప్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వైస్ చెర్ పర్సన్గా కూడా చేస్తోంది. అప్పుడప్పుడు పలు సేవా కార్రక్రమాల్లో పాల్గొని గొప్ప మనసు చాటుకుంటుంది కూడా.
ఇక ఇటీవలే ఉపాసన తన భర్త రామ్ చరణ్ పై పొగడ్తల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. చరణ్ బాగా అర్థం చేసుకోవడమే కాదు.. సపోర్ట్ కూడా చేస్తాడంటూ చెప్పుకొచ్చింది. ఏమైనా చేయాలనుకుంటే దానికి వెంటనే సహకరిస్తాడని తెలిపింది. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తన వెంట ఉంటాడని పేర్కొంది. సినిమాల్లో కాకపోయినా.. ఉపాసనకు హీరోయిన్ల లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పుకోవచ్చు.
ఇదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. కాగా.. మెగా కోడలు తాజాగా దీనిపై సోషల్ మీడియా వేదిక అయిన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో.. ‘‘నిన్న రాత్రి దేశం మొత్తం గాఢ నిద్రలో ఉన్నప్పుడు 15 భారతీయ నగరాలను రక్షించినందుకు భారత సాయుధ దళాలకు ధన్యవాదాలు. మేము స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి కారణం మీరే. ధన్యవాదాలు జై హింద్’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.