- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అజిత్కు మహీంద్రా అరుదైన కానుక.. ఫార్ములా ఈ-థీమ్ ఎస్యూవీ గిఫ్ట్
కోలీవుడ్ స్టార్ హీరో, రేసింగ్ అంటే ప్రాణం ఇచ్చే అజిత్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కోలీవుడ్ స్టార్ హీరో, రేసింగ్ అంటే ప్రాణం ఇచ్చే అజిత్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దుబాయ్లో చిక్కుకుపోయిన ఆయన, ఎట్టకేలకు సురక్షితంగా చెన్నై చేరుకున్నారు. అలాగే ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా, అజిత్ పట్ల తన గౌరవాన్ని చాటుకుంటూ ఒక ప్రత్యేకమైన కారును బహుమతిగా అందించింది. వివరాల్లోకి వెళితే.. కార్ రేసింగ్లో పాల్గొనడానికి దుబాయ్ వెళ్లిన అజిత్, అక్కడ నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా కొంతకాలం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి, ఇజ్రాయెల్-అమెరికా దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అజిత్ భద్రత గురించి ఆందోళన చెందిన అభిమానులకు ఆయన మేనేజర్ సురేష్ చంద్ర భరోసా ఇచ్చారు. పరిస్థితులు సద్దుమణిగడంతో అజిత్ సురక్షితంగా చెన్నై చేరుకున్నారు.
రేసింగ్ అభిరుచికి మహీంద్రా గౌరవం
చెన్నై చేరుకున్న అజిత్కు మహీంద్రా సంస్థ ఘన స్వాగతం పలికింది. ఆయనకు రేసింగ్పై ఉన్న మక్కువను గుర్తించిన సంస్థ, సరికొత్త 'BE 6' ఫార్ములా ఈ-థీమ్ ఎస్యూవీని కానుకగా అందజేసింది. ఈ కారును మహీంద్రా ఆటో విభాగం హెడ్ వేలుస్వామి స్వయంగా అజిత్కు అందజేశారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఫార్ములా ఈ-థీమ్ ఎస్యూవీ కావడం గమనార్హం. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని యాజమాన్యం చెబుతుతోంది. ఈ కారు అధికారిక లాంచ్ కార్యక్రమంలో కూడా అజిత్ పాల్గొన్నారు.






