తొలి భారతీయ సినిమాగా ‘ఏక్ థా టైగర్’

by Chukka Sudharani |

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘ఏక్ థా టైగర్’ చిత్రానికి తాజాగా అరుదైన గౌవరం దక్కింది.

తొలి భారతీయ సినిమాగా ‘ఏక్ థా టైగర్’
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘ఏక్ థా టైగర్’ చిత్రానికి తాజాగా అరుదైన గౌవరం దక్కింది. యశ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో రూపొందిన ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. ఇందులో సల్మాన్ ఖాన్ ‘రా’ ఏజెంట్‌గా, కత్రినా కైఫ్ ఐఎస్ఐ ఏజెంట్‌గా నటించారు. రూ. 75కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 2012లో రిలీజై బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 330 కోట్లు రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇన్నాళ్లకు ఈ చిత్రం మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. వాషింగ్టన్ డీసీలోని ఇంటర్నేషనల్ స్పై మ్యూజియంలో ‘ఏక్ థా టైగర్’ మూవీ పోస్టర్‌ను ప్రదర్శించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగా ఇదే కావడంతో నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story