రాధ తన కూతురికి కట్నంగా ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా..?

by Disha Web Desk 6 |
రాధ తన కూతురికి కట్నంగా ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక నాయర్‌కు పరిచయం అక్కర్లేదు. కార్తీక నాగచైతన్య జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. రంగం మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె తన ప్రియుడు రోహిత్ మీనన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. అలాగే కేరళలోని త్రివేండ్రంలో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక కార్తీక పెళ్లిలో అన్ని నగలు వేసుకోవడంతో రాధ ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించిందో అని అందరూ మాట్లాడుకున్నారు.

తాజాగా, రాధా తన కూతురికి ఇచ్చిన కట్నం గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అయితే రాధా తన కూతురు పెళ్లికి కట్నంగా 8 కోట్లు విలువ చేసే ఒక ఖరీదైన కారుతో పాటు 30 కోట్ల విలువ చేసే బంగారాన్ని కట్నంగా ఇచ్చిందట. ఇక ఇవి మాత్రమే కాకుండా దుబాయ్ లో ఉండే తమ రెస్టారెంట్ ని కూడా కూతురు పేరు మీద అల్లుడికి కట్నంగా రాసిచ్చిందట. ఇలా రాధా తన కూతురికి భారీగానే కట్న కానుకలు ఇచ్చినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed