- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anil Ravipudi: నెక్స్ట్ మూవీ పనుల కోసం అక్కడికి వెళ్లిన స్టార్ డైరెక్టర్
అనిల్ రావిపూడి కథ, స్క్రీన్ప్లే పనులను వైజాగ్లో పూర్తి చేసే సెంటిమెంట్ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక త్వరలో వెంకటేష్, కళ్యాణ్ రామ్లతో చేయబోయే సినిమాకి కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు, నటులు కొన్ని సెంటిమెంట్లను ఎంతో బలంగా నమ్ముతుంటారు. ఒక సినిమా విడుదలై మంచి విజయం సాధిస్తే, ఆ తర్వాత చేసే చిత్రాలకు కూడా అదే అంశాలను సెంటిమెంట్గా భావించి యథావిధిగా ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా అవి వరుసగా విజయాలు అందిస్తే, ప్రతి సినిమాకూ ఆ సెంటిమెంట్లను తూచా తప్పకుండా పాటించడం ఇండస్ట్రీలో సాధారణంగా కనిపించే విషయం. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన అనిల్ రావిపూడికి కూడా ఒక బలమైన సెంటిమెంట్ ఉంది. తన మొదటి సినిమా నుంచే కథ మరియు స్క్రీన్ప్లే పనులను వైజాగ్లోనే పూర్తి చేయడం ఆయన అలవాటుగా మార్చుకున్నారు. అక్కడ కథ, స్క్రీన్ప్లే పూర్తయిన తర్వాతే తిరిగి వచ్చి సినిమా షూటింగ్ను ప్రారంభించడం ఆయన స్టైల్గా మారింది.
ఈ దర్శకుడు తన కెరీర్ ప్రారంభమైన ‘పటాస్’ సినిమా నుంచి తాజాగా విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు' వరకు ఇదే ఫార్ములాను అనుసరిస్తూ వచ్చి ప్రతి మూవీతో విజయాన్ని అందుకున్నారు. ఇక అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో చేయనున్నాడు. ఈ సినిమాకు కూడా ఆయన ఇదే సెంటిమెంట్ను కొనసాగిస్తున్నట్లు సమాచారం. తాజాగా అనిల్ రావిపూడి వైజాగ్కు వెళ్లి అక్కడే కథ, స్క్రీన్ప్లే పనులను ప్రారంభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే తిరిగి వచ్చి జూన్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.






