- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు.. నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక నిర్ణయం
నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) వ్యవహారం ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.

దిశ, వెబ్డెస్క్: నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) వ్యవహారం ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. పదే పదే ఇతర నటులపై దురుసుగా మాట్లాడటంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో అలీపై రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. నిండు సభలో అలీని, రోజాను అనరాని మాటలు అన్నారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడం నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్పై తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. దాంతో పాటు ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ‘ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇచ్చి మాట్లాడుతా. ఇప్పటివరకు నేను ఎవరెవరికి అయితే మర్యాద ఇవ్వకుండా మాట్లాడానో వాళ్లంతా నా వాళ్లు. నా అనుకున్నాను కాబట్టే చనువుతో అలా మాట్లాడాను. వాళ్లతో ఇప్పుడే కాదు.. ఎప్పుడూ అలాగే మాట్లాడుతా’ అని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.






