బీజేపీకి సినీ గ్లామర్.. పార్టీలోకి ఆ ముగ్గురు హీరోయిన్లు!

by  |
బీజేపీకి సినీ గ్లామర్.. పార్టీలోకి ఆ ముగ్గురు హీరోయిన్లు!
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ మాదిరి ఏపీలోనూ బీజేపీ పాగా వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీకి గట్టి పోట్టిని ఇచ్చేందుకు రెడీ అవుతోంది. గతంలో టీడీపీ అనుసరించిన వ్యూహాలను అనుసరిస్తోంది. ఇందులో భాగంగా పార్టీకి సినీ గ్లామర్‌ను అద్దెందుకు ప్లాన్ చేసుకుంటుంది. ఈ మేరకు ఒకప్పుడు వెండితెరపై వెలుగులు విరజిమ్మిన హీరోయిన్లు వాణి విశ్వనాథ్, ప్రియారామన్, వర్ధమాన హీరోయిన్ అర్చనను బీజేపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఆ తారమణులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో నటి అర్చన భేటీ అయ్యారు.

ఇప్పటికే వైసీపీలో సినీ నటి రోజా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆమెతోపాటు పోసాని కృష్ణ మురళి, ఆలీ, పృధ్వీరాజ్ ఉన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా హీరో పవన్ కళ్యాణ్ ఉన్నారు. టీడీపీలో బాలకృష్ణతోపాటు మురళీమోహన్, కవిత తదితరులు ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి కూడా సినీ గ్లామర్ ను తెచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు ముందే హీరోయిన్లను పార్టీలో చేర్చుకునేందుకు సోము వీర్రాజు వ్యూహం పండినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed