సిక్కింలో వీకెండ్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్న సీనియర్ హీరోలు

by  |
సిక్కింలో వీకెండ్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్న సీనియర్ హీరోలు
X

దిశ, వెబ్ డెస్క్:టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్నేహితులు ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి , కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అని టక్కున చెప్పేస్తారు. మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా మేమెప్పుడూ స్నేహితులమే అంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక తాజాగా ఈ ఇద్దరు స్నేహితులు సిక్కిం టూర్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ విషయాన్ని మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపారు.

చిరు , మోహన్ బాబు కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ ” ఇద్దరు మాస్ట్రోలు సిక్కిం టూర్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంత రచ్చ జరుగుతుందో మీ అందరికి తెలుసు. చిరంజీవి అంకుల్ .. నాన్నను ఒప్పించి వీకెండ్ ట్రిప్ కి తీసుకెళ్లడం మీకే సాధ్యమైంది. ఈ విషయంలో నేను అసూయ పడుతున్నాను. మీ ఇద్దరు సిక్కింలో ఆనంద క్షణాలను గడపడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ట్రిప్ లో ఏదో ఒకరోజు మేము కూడా జాయిన్ అవుతామంటూ” పోస్ట్ చేసింది. ఇకపోతే ప్రస్తుతం చిరు ‘ఆచార్య’ షూటింగ్ లో బిజీ గా ఉండగా ..మోహన్ బాబు ‘సన్నాఫ్ ఇండియా’ చిత్రంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకులముందుకు రానున్నాయి.

Next Story

Most Viewed