- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతిచెందారు. వివరాల ప్రకారం.. భోపాల్లోని కమల నెహ్రు ఆసుపత్రి పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉండగా అందులో 36 మంది క్షేమంగా ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
మంటలు చెలరేగిన విషయాన్ని తెలుసుకున్న చిన్నారుల బంధువులు అక్కడికి పరుగులు తీశారు. దీంతో ఆసుపత్రి లోపల, బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రి విశ్వాస్సారంగ్ స్పందించారు. మృతుల తల్లిదండ్రులకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని పేర్కొన్నారు. అయితే షార్ట్సర్క్యూట్కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు.
At least 4 infants have died in a #Bhopal hospital fire. Madhya Pradesh govt has ordered high level probe into the incident#BhopalFire | #BhopalHospitalTragedy | #MadhyaPradesh | @ChouhanShivraj pic.twitter.com/GV3n5hEmav
— editorji (@editorji) November 9, 2021