డీజీపీకి చంద్రబాబు లేఖ.

by  |
Chandrababu
X

దిశ,వెబ్ డెస్క్: ఏపీ డీజీపీకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడంపై ప్రజలు తీవ్రంగా కలవర పడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై వైసీపీ సర్కార్ దాడులకు దిగుతోందని ఆయన తెలిపారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడి దళితులపై దాడుల్లో భాగమేనని ఆయన చెపారు. దళిత మహాసభ రౌండ్ టేబుట్ కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ దుశ్చర్యలను జడ్జి రామకృష్ణ ఖండించారని ఆయన తెలిపారు. ఆ మరుసటి రోజే ఈ దాడి జరగిందన్నారు. దీన్ని బట్టి చూస్తే జడ్జి గొంతును నొక్కేందుకే వైసీపీ ప్రోద్బలంతో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోందన్నారు.

రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. వాటిని అణచివేసే చర్యలు చేపట్టక పోతే దళితులపై దాడులు పేట్రేగి పోతాయని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆయన లేఖలో కోరారు.

Next Story

Most Viewed