రేపు హైదరాబాద్‎కు కేంద్ర బృందం

by  |
రేపు హైదరాబాద్‎కు కేంద్ర బృందం
X

దిశ, వెబ్‎డెస్క్: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్‎లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు గురువారం నగరానికి కేంద్రం బృందం రానుంది. రెండు రోజుల పాటు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. నష్ట తీవ్రతను అంచనా వేయనుంది.

కాగా, ఈ నెల 13వ తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో రూ.వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. తక్షణ సహాయంగా రూ.1350 కోట్లను విడుదల చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు రానుంది.



Next Story

Most Viewed