కరోనా పరీక్షలకు ఐదు ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతి

by  |
కరోనా పరీక్షలకు ఐదు ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతి
X

దిశ, హైదరాబాద్: తెలంగాణలో కరోనా టెస్ట్‌లు చేసేందుకు ఐదు ప్రైవేట్‌ ల్యాబ్‌లకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. జూబ్లీహిల్స్‌, హైదర్‌గూడలో ఉన్న అపోలో ఆస్పత్రి.. సికింద్రాబాద్‌, కొండాపూర్‌ లో ఉన్న ఎస్‌ఆర్‌ఎల్‌ డయాగ్నోస్టిక్స్‌, బోయినపల్లిలోని మెడిక్స్‌ ల్యాబ్‌‌లకు కేంద్రం అనుమతిచ్చింది. కాగా ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో కరోనా టెస్ట్‌లు చేస్తే పూణే లేదా ఢిల్లీకి పంపాల్సి వచ్చేది. దీంతో రిపోర్టుల కోసం 74 గంటల వరకూ వేచి చూడాల్సి పరిస్థితి ఉండేది. అయితే.. ఇకపై తెలంగాణలోనే టెస్ట్‌లు నిర్వహించుకోవడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రిపోర్టులు త్వరగా వచ్చే అవకాశం ఉంది.



Next Story

Most Viewed