- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, డైనమిక్ బ్యూరో : రోడ్డు ప్రమాదాల్లో గాయపడి సరైన సమయానికి ఆసుపత్రికి తరలించకపోవడంతో చాలా మంది రోడ్డుపైనే ప్రాణాలు వదులుతున్నారు. యాక్సిడెంట్ అయిన వారిని రక్షిస్తే కేసులో ఇరుక్కుంటామని చాలా మంది అపోహ పడుతుంటారు. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనిపై దృష్టి సారించిన కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడే వారిని ప్రోత్సహించేందుకు కేంద్రం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
క్షతగాత్రులను మొదటి గంటలోగా (గోల్డెన్ అవర్) ఆస్పత్రికి తరలించిన వారికి రూ. 5 వేల ప్రోత్సాహక బహుమతి అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం 2021 అక్టోబర్ 15 నుంచి అందుబాటులోకి వచ్చి, 2026 మార్చి 31 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల రవాణా శాఖల కార్యదర్శులకు సమాచారం పంపింది. అంతేకాకుండా రూ. 5 వేల ప్రోత్సాహకంతో పాటు వారిని అభినందిస్తూ సర్టిఫికెట్ను అందించనున్నట్లు తెలిపింది. ఇక ఇలా చేసినవారిలో కొంత మందిని ఎంపిక చేసి ఏడాదికోసారి జాతీయ స్థాయి అవార్డులను ప్రకటించనున్నట్లు తెలిపింది. వారికి రూ. లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఒకరి కంటే ఎక్కువ మంది బాధితులను, ఒకరి కంటే ఎక్కువ మంది కాపాడితే ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది.