గాంధీ ఆసుపత్రి: అత్యాచార ఘటనలో కీలక ఆధారాలు లభ్యం

by  |
గాంధీ ఆసుపత్రి: అత్యాచార ఘటనలో కీలక ఆధారాలు లభ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: చికిత్స కోసం అక్కచెల్లెళ్లపై గాంధీ ఆసుపత్రి సిబ్బంది అత్యాచారానికి పాల్పడటంపై బీజేపీ మహిళా మోర్చా నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక చిలకలగూడ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ధర్నా చేపట్టారు. నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో చిలకలగూడ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా, కేసు నమోదైన వెంటనే రంగంలోకి దిగిన చిలకలగూడ పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. గాంధీ ఆస్పత్రి నుంచి బాధిత మహిళ అక్కను పోలీసులు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. ఆమె ఎటువైపు వెళ్ళింది అనే దిశగా చిలకలగూడ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో అనుమానితులు ఉమా మహేశ్వర్, తో పాటు ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని విచారిస్తున్నారు.

Read more

వీళ్లు మనుషులా.. కామంతో ఓ వైపు చిన్నాన్న, మరో వైపు అన్నయ్య.. చివరికి

గాంధీ ఆసుపత్రిలో దారుణం.. అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం



Next Story

Most Viewed