తబ్లిఘీ జమాత్ ఆర్థిక వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు

by  |
తబ్లిఘీ జమాత్ ఆర్థిక వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు
X

న్యూఢిల్లీ : తబ్లిఘీ జమాత్ సంస్థ ఆర్థిక వ్యవహారాలపై సీబీఐ ప్రాథమిక విచారణను ప్రారంభించింది. ప్రభుత్వానికి తెలియకుండా విదేశాల నుంచి విరాళాలు పోగుచేస్తున్నదని, నకిలీ నగదు లావాదేవీలు చేసిందన్న ఆరోపణలపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఫారీన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలను తబ్లిఘీ జమాత్ ఉల్లంఘించిందని కేంద్ర హోం శాఖ ఫారీనర్స్ డివిజన్ ఆరోపణలపై ఈ కేసు నమోదైనట్టు కొన్నివర్గాల సమాచారం. తబ్లిఘీ జామత్, దాని ట్రస్టీలు విదేశాల నుంచి వచ్చిన విరాళాల వివరాలు సంబంధిత ప్రభుత్వాధికారికి చెప్పడం లేదని, చట్టవ్యతిరేక లావాదేవీలకు పాల్పడుతున్నట్టు ఓ ఫిర్యాదు అందిందని సీబీఐ ప్రతినిధి ఆర్‌కె గౌర్ తెలిపారు.దీని ఆధారంగానే తబ్లిఘీ జమాత్ నిర్వాహకులు, ఇతరులపై కేసు నమోదైనట్టు వెల్లడించారు..

Next Story

Most Viewed