రాచకొండ జోన్ పరిధిలో మాస్క్ ధరించని వారిపై కొరడా.. లక్ష దాటిన కేసులు..

by  |
రాచకొండ జోన్ పరిధిలో మాస్క్ ధరించని వారిపై కొరడా.. లక్ష దాటిన కేసులు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా ఉధృతంగా పెరుగుతున్న సమయంలో కరోనా కట్టడిలో భాగంగా ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ ధరించని వారికి చలాన్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2021 నవంబర్ వరకు మాస్క్ ధరించని కేసులు 1,08,736 నమోదయ్యాయి. ముఖ్యంగా ఎల్బీనగర్ జోన్ పరిధిలో 35,862, మల్కాజ్‌గిరి జోన్ పరిధిలో 34,205, భువనగిరి జోన్ పరిధిలో 11,951, ఆ జోన్ ట్రాఫిక్ వింగ్‌లో 26,718 మాస్క్ ధరించని కేసులు నమోదు చేశారని పోలీసులు తెలిపారు.


Next Story