- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ముంబైలోని క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకుని హైదరాబాద్కు వచ్చిన కరోనా అనుమానితుడిని ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..ఈనెల దుబాయి నుంచి ముంబై వచ్చిన యువకుడికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే అతన్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించి వైద్యం అందజేశారు. అదే సమయంలో అధికారుల కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకుని హైదరాబాద్కు చేరుకున్నాడు. ఆపై తన సొంత జిల్లా పశ్చిమ గోదావరికి వెళ్లేందుకు ప్రైవేటు బస్సెక్కాడు. ఈక్రమంలోనే అతడి చేతికి ఉన్న ముద్రను చూసిన తోటి ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఆ ముద్ర ఏంటని ఆరా తీయడంతో ఆ యువకుడు కంగారు పడ్డాడు. దీంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు అతడిని వెంటనే బస్సు నుంచి కిందికి దించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Tags: carona suspected, dubai, mumbai, hud, lb nagar police, west godavari