శుభకార్యానికి వెళ్లి తిరిగొస్తుండగా.. బూడిదైన కారు

by  |
శుభకార్యానికి వెళ్లి తిరిగొస్తుండగా.. బూడిదైన కారు
X

దిశ, రాజేంద్రనగర్ : రన్నింగ్ కారులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైన ఘటన గురువారం అర్థరాత్రి మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్ట గుట్టకు చెందిన మహ్మద్ ఇక్బాల్ తన కుటుంబంతో కలిసి శాస్త్రీపురంలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్ళాడు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో దుర్గానగర్ సమీపంలోకి రాగానే కారు ఇంజిన్ భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో కారు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed