నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు : పొలార్డ్

by  |
నేనున్నానంటూ భరోసా ఇచ్చాడు : పొలార్డ్
X

దిశ, వెబ్‌డెస్క్: అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరును అయిదు వికెట్ల తేడాతో ఓడించి, ఈ విజయంతో 13వ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డుల్లోకి ఎక్కింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ కిరాన్ పొలార్డ్ మాట్లాడుతూ… ‘ఏబీ డివిలియర్స్ వికెట్ తీయడం ఆనందంగా ఉన్నది. ఇక ఛేదనలో మేం వికెట్లు కోల్పోతున్న సమయంలో సూర్యకుమార్ చక్కగా బ్యాటింగ్ చేశాడు. ఒత్తిడిని అధిగమించి నేనున్నానంటూ మాకు భరోసా ఇచ్చాడు. ప్లేఆఫ్స్ చేరుకోవడం ఆనందంగా ఉన్నది.’ అని పొలార్డ్ తెలిపారు.



Next Story

Most Viewed