సాగర్‌లో.. టీఆర్ఎస్ అభ్యర్థి అధిక్యం

by  |
సాగర్‌లో..  టీఆర్ఎస్ అభ్యర్థి అధిక్యం
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకు తొలి మూడు రౌండ్లకు కౌంటింగ్ పూర్తయింది. కాగా తొలి 3 రౌండ్లలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ లీడ్ దిశగా దూసుకెళుతున్నారు. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ 4228 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ 2753 ఓట్లు సాధించింది. రెండో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ 2216 ఓట్లతో లీడ్ లో ఉంది. మూడో రౌండ్లో టీఆర్ఎస్కు 3421, కాంగ్రెస్కు 2882 ఓట్లు వచ్చాయి. 3వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 2665 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 4వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ ఎస్ 3457 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 4వ రౌండ్ లో టిఆర్ఎస్ కు 4186, కాంగ్రెస్ కు 3202. 4వ రౌండ్ లో టీఆర్ ఎస్ లీడ్ 984. ఇక ఐదవ రౌండ్ ముగిసే సరికి టీఆర్ ఎస్ 4334 ఓట్ల ఆధిక్యంలో ఉంది. 5వ రౌండ్ లో టిఆర్ ఎస్ కు 3442, కాంగ్రెస్ కు 2676, బీజేపీ కి 74. 5వ రౌండ్ లో టీఆరెస్ లీడ్ 766.

Next Story

Most Viewed