- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Swiggy: 'వన్' ఆర్డర్లపై అదనపు ఛార్జీలు విధించనున్న స్విగ్గీ
నవంబర్ 25 నుంచి కొత్త రుసుము అమల్లోకి వస్తుందని, ఈ మేరకు ఎంపిక చేసిన రెస్టారెంట్లకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ తన ప్రీమియం మెంబర్షిప్ 'వన్' నుంచి చేసే ఆర్డర్లపై కొత్త ఛార్జీలను అమలు చేయనున్నట్టు వెల్లడించింది. ఎంపిక చేసిన రెస్టారెంట్లకు ఈ కొత్త ఛార్జీలు వర్ర్తిస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్ 25 నుంచి కొత్త రుసుము అమల్లోకి వస్తుందని, ఈ మేరకు ఎంపిక చేసిన రెస్టారెంట్లకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొంది. ఆర్డర్ మొత్తంపై ఆధారపడి రుసుము ఉండొచ్చని సమాచారం. కొత్త రుసుము కారణంగా ఒక్కో ఆర్డర్పై రూ. 2-5 మధ్య పెరిగే అవకాశం ఉంది. చెల్లించాల్సిన తుది మొత్తం ఒక రెస్టారెంట్ చెల్లించే ఖచ్చితమైన రుసుము ఆ వారంలో ఎన్ని స్విగ్గీ వన్ ఆర్డర్లను పొందుతుందో దానిపై ఆధారపడి ఉంటుందని కంపెనీ వివరణ ఇచ్చింది. కొత్త లెవీ ప్రామాణికంగా 17–25 శాతం బేస్ కమిషన్, ఇతర రుసుములు వంటి ప్రస్తుత ఛార్జీలకు అదనంగా ఉంటుంది. కాగా, ఈ ఏడాది మే నెల నుంచి కంపెనీ తన ప్రీమియం మెంబర్లకు అదనపు రుసుమును వసూలు చేయడం మొదలుపెట్టింది. గతంలో స్విగ్గీ వన్ వినియోగదారులకు ఈ రుసుము విషయంలో మినహాయింపు ఉండేది.






