560 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

by Dishanational1 |
560 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు అధిక లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతుకు తోడు దేశీయంగా కీలక బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో కొనుగోళ్ల జోరు సూచీలకు కలిసొచ్చింది. ముఖ్యంగా ఆసియా మార్కెట్లలో మెరుగైన ర్యాలీ, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు దిగిరావడం, విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం వంటి పరిణామాలతో లాభాలు పెరిగాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 560.29 పాయింట్లు లాభపడి 73,648 వద్ద, నిఫ్టీ 189.40 పాయింట్ల లాభంతో 22,336 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకింగ్, ఫార్మా, ఫైనాన్స్, మీడియా, ఐటీ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, విప్రో, ఎస్‌బీఐ, ఐసీఐఐసీఐ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.37 వద్ద ఉంది. స్టాక్ మార్కెట్ల భారీ ర్యాలీతో సోమవారం మదుపర్ల సంపద ఒక్కరోజే రూ. 4.52 లక్షల కోట్లు పెరిగాయి. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 397.97 లక్షల కోట్లకు చేరుకుంది.



Next Story

Most Viewed