ఆగష్టు నాటికి కొత్తగా 500 ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల ప్రారంభం: ఓలా ఎలక్ట్రిక్!

by Disha Web Desk 13 |
ఆగష్టు నాటికి కొత్తగా 500 ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల ప్రారంభం: ఓలా ఎలక్ట్రిక్!
X

చెన్నై: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ 2023, ఆగష్టు నాటికి కొత్తగా 500 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. దాని ద్వారా కంపెనీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల సంఖ్య 1,000కి చేరుకుంటుంది. ఇటీవల జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో ఓలా తన 500వ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించిన తరుణంలో ఈ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కంపెనీ ఉనికి దేశవ్యాప్తంగా సుమారు 300 నగరాల్లో విస్తరించి ఉది.

రానున్న రోజుల్లో విస్తరణను మరింత వేగవంతం చేస్తూ దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు చేర్చాలనే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. దేశంలోని 98 శాతం మార్కెట్‌ను చేరుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొంది. '500వ స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా నేరుగా వినియోగదారులకు చేరుకోవాలనే తమ లక్ష్యాన్ని సాధించడం పట్ల గర్వంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలను పూర్తి చేస్తామని ఓలా ఎలక్ట్రిక్ సీఎంఓ అన్షుల్ ఖండెల్వాల్ చెప్పారు.

Next Story