UPI ట్రాన్సక్షన్లలో సరికొత్త రికార్డు

by Disha Web Desk 2 |
UPI ట్రాన్సక్షన్లలో సరికొత్త రికార్డు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్నాలజీ పుణ్యమా అని క్యాష్ కంటే యూపీఐ ట్రాన్సక్షన్ల వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. మునుపెన్నడు లేని విధంగా యూపీఐ ట్రాన్సక్షన్లలో రికార్డులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో యూపీఐ ద్వారా ఏకంగా 870 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. లావాదేవీల సంఖ్య, లావాదేవీల విలువ, రెండింటిలోనూ ఈ ఏడాది మార్చిలో కొత్త రికార్డులు నమోదైనట్లు పేర్కొంది. వీటి విలువ రూ. 14 లక్షల కోట్లు. 2022 మార్చితో పోలిస్తే సంఖ్యాపరంగా యూపీఐ లావాదేవీలు 60 శాతం, విలువ పరంగా 46 శాతం ఎక్కువైనట్లు ఎన్​పీసీఐ (నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా) డేటా వెల్లడిస్తోంది. గతేడాది మార్చిలో రూ. 9.60 లక్షల కోట్ల విలువైన 540 కోట్ల లావాదేవీలు యూపీఐ ప్లాట్​ఫామ్​ ద్వారా జరిగాయి.

జనవరి 2023లో మొదటిసారిగా యూపీఐ 800 కోట్ల ట్రాన్సాక్షన్లను ప్రాసెస్​ చేసింది. కానీ, ఫిబ్రవరిలో ఇవి కొంత తగ్గాయి. 2016లో మొదలైన యూపీఐ ప్లాట్​ఫామ్​కు 100 కోట్ల లావాదేవీల మార్కు అందుకోవడానికి మూడేళ్లు పట్టింది. మొత్తం డిజిటల్​ పేమెంట్స్​లో యూపీఐ ప్లాట్​ఫామ్​కు 75 శాతం వాటా ఉంది. కాగా, యూపీఐ ద్వారా రూ.2000 కన్నా ఎక్కువ ట్రాన్సక్షన్లు చేస్తే లావాదేవి విలువలో 1.1 శాతం పన్ను విధించనున్నట్లు ఎన్‌పీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇది ప్రీపెయిడ్ పేమెంట్స్​ ఇన్​స్ట్రుమెంట్స్ ద్వారా చేసే మర్చంట్ ట్రాన్సాక్షన్స్​కు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Next Story