ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన కరూర్ వైశ్యా బ్యాంక్!

by Disha Web Desk 12 |
ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన కరూర్ వైశ్యా బ్యాంక్!
X

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్(కేవీబీ) తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్లపై వడ్డీని పెంచామని, సవరించిన రేట్లు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. కేవీబీ అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, సాధారణ ఖాతాదారులకు 7 రోజుల నుంచి 6 ఏళ్ల కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై వడ్డీ 4 శాతం నుంచి 6.25 శాతం వరకు లభిస్తుంది. కొన్ని ఎంపిక చేసిన కాలవ్యవధులపై గరిష్ఠంగా 7.50 శాతం వడ్డీని బ్యాంకు ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు అన్ని కాలవ్యవధులపై అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీ వర్తిస్తుంది.

7-30 రోజుల డిపాజిట్లపై 4 శాతం వడ్డీ, 31-90 రోజులకు 5.25 శాతం వడ్డీ, 91-180 రోజులకు 6 శాతం, 181-270 రోజులకు 6.25 శాతం, 271 రోజుల నుంచి ఏడాది డిపాజిట్లపై 6.50 శాతం, ఏడాది నుంచి 443 రోజుల డిపాజిట్లపై 7 శాతం వడ్డీని బ్యాంకు ఇస్తుంది. అత్యధికంగా 444 రోజుల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లకు 7.50 శాతం వడ్డీ ఇవ్వనుంది. 445-554 రోజుల డిపాజిట్లకు 7 శాతం, 555 రోజుల డిపాజిట్లకు 7.25 శాతం, 556 రోజుల నుంచి 3 ఏళ్లకు 7 శాతం, 3-6 ఏళ్లకు 6.25 శాతం వడ్డీని బ్యాంకు ఇవ్వనుంది.


Next Story

Most Viewed