ఈ ఏడాది 40 శాతం తగ్గనున్న క్యాంపస్ నియామకాలు!

by Disha Web Desk 17 |
ఈ ఏడాది 40 శాతం తగ్గనున్న క్యాంపస్ నియామకాలు!
X

న్యూఢిల్లీ: ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం లో ఉన్న కంపెనీలు గణనీయంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ధోరణి స్టార్టప్‌లు మొదలుకుని మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీల్లోనూ కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం ఆందోళనలు పెరుగుతున్న కారణంగా ఖర్చులు తగ్గించేందుకు కంపెనీలు భారీ లేఆఫ్స్ నిర్ణయం తీసుకుంటున్నాయి. దాని ప్రభావం క్యాంపస్ నియామకాలపై పడుతోంది.

ప్రముఖ రిక్రూట్‌మెంట్ సంస్థ టీమ్‌లీజ్ డిజిటల్ డేటా ప్రకారం, ప్రతికూల పరిణామాల మధ్య ఈ ఏడాది భారత ఐటీ కంపెనీలు క్యాంపస్ హైరింగ్‌ను 40 శాతం మేర తగ్గించాలని భావిస్తున్నాయి. గతేడాది దేశీయ ఐటీ సంస్థలు 2.30 లక్షల ఉద్యోగులను క్యాంపస్‌ల నుంచి నియమించుకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఏడాది ఆ సంఖ్య 1.50 లక్షలకు చేరుకోవచ్చు. గతేడాది నియమించుకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. కాబట్టి కొత్త క్యాంపస్ నియామకాలు తగ్గే అవకాశాలు ఉన్నాయని విప్రో హెచ్ఆర్ విభాగం హెడ్ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు.

Also Read..

భారత్‌లో తయారీ ప్లాంటు ఏర్పాటుపై ఎలన్ మస్క్ ప్రకటన!

Next Story

Most Viewed