EPFO సభ్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఓ భారీ గుడ్ న్యూస్ తెలిపింది.

EPFO సభ్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్
X

దిశ , వెబ్ డెస్క్ : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఓ భారీ గుడ్ న్యూస్ తెలిపింది. EPFO ఆటో-సెటిల్మెంట్ లిమిట్‌ను రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దాదాపు 7.5 కోట్ల EPFO సభ్యులకు లబ్ది చేకూరనుంది. ఈ పెంపు వల్ల ఎక్కువ మంది సభ్యులు వేగంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెటిల్మెంట్ పొందగలరు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైన వారికి ఇది ఎంతో ఉపయోగకరం. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఓ ప్రకటనలో ధృవీకరించారు.

Next Story