- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FSSAI: నిబంధనల ఉల్లంఘనతో పతంజలి కారంపొడి రీకాల్ చేయాలన్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ
by S Gopi |
కంపెనీ తయారు చేసిన కారంపొడిలో కలుషితాలు, టాక్సిన్స్, ఇతర అవశేషాలు ఉన్నట్టు గుర్తించామని ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసుల్లో పేర్కొంది

X
దిశ, బిజినెస్ బ్యూరో: బాబా రామ్దేవ్ నేతృత్వంలోని పతంజలి గ్రూపునకు చెందిన పతంజలి ఫుడ్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా కంపెనీకి చెందిన మొత్తం కారం పొడిని రీకాల్ చేయాలని ఫుడ్ సేఫ్టీ నియంత్రణ సంస్థ ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు పతంజలి సంస్థకు నోటీసులు జారీ చేసినట్టు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. కంపెనీ తయారు చేసిన కారంపొడిలో కలుషితాలు, టాక్సిన్స్, ఇతర అవశేషాలు ఉన్నట్టు గుర్తించామని, ఇది 2011 నాటి నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని, కాబట్టి నిబధనలకు అనుగుణంగా లేని, తయారైన కారం పొడిని తక్షణం రీకాల్ చేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో గురువారం పతంజలి షేర్ ధర 1 శాతానికి పైగా క్షీణించి రూ. 1,839.8 వద్ద ముగిసింది.
Next Story






