లింగంపల్లిలో బస్సు బే ప్రారంభం..!

by  |
లింగంపల్లిలో బస్సు బే ప్రారంభం..!
X

దిశ, పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని లింగంపల్లి చౌరస్తాలో రూ.19.98 లక్షలతో నిర్మించిన బస్సు బేను మెదక్ ఎమ్మెల్సీ వి.భూపాల్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్లు అంజయ్య యాదవ్, డిప్యూటీ కమిషనర్ బాలయ్య, ఏసీపీ రవి కిషోర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుష్ప నగేష్, డిపో మేనేజర్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాకు ముఖ ద్వారమైన లింగంపల్లి చౌరస్తా నుంచి నిత్యం వేలాదిమంది ప్రయాణిస్తుంటారని.. ప్రయాణికుల కోసం మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. సంగారెడ్డి, జహీరాబాద్, బీదర్, నారాయణఖేడ్, తదితర ప్రాంతాలకు ఈ ప్రయాణ ప్రాంగణం నుంచి బస్సులు వెళ్తాయని అన్నారు.

Next Story