ఫ్లాష్.. ఫ్లాష్.. ప్రముఖ గేయ రచయిత కందికొండ మృతి

by Sathputhe Rajesh |   (  Updated:2022-03-12 11:28:02  IST  )

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ గేయరచయిత కందికొండ

ఫ్లాష్.. ఫ్లాష్.. ప్రముఖ గేయ రచయిత కందికొండ మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ గేయరచయిత కందికొండ యాదగిరి(49) మృతి చెందారు. గత రెండేళ్లుగా కందికొండ క్యాన్సర్ తో బాధపడుతుండగా.. కీమో థెరపీతో స్పైనల్ కార్డ్ దెబ్బతినింది. గత కొద్ది రోజులుగా ఆరోగ్యం విషమించడంతో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. కందికొండ స్వస్థలం నర్సంపేట మండలం నాగుర్లపల్లి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా అనేక పాటలను ఆయన రచించారు. కందికొండను తెలుగు చిత్ర పరిశ్రమకు దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి పరిచయం చేయగా.. ఎక్కువగా పూరి జగన్నాథ్ అవకాశాలు ఇచ్చారు. ఆయన 143,పోకిరీ, ఇడియట్, స్టాలిన్, చక్రం చిత్రాలలోని పాటలకు రచయితగా సేవలందించారు. అంతేకాకుండా తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడే విధంగా బతుకమ్మ పాటలను రాశారు.





Next Story