కరీంనగర్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

by Web Desk |
కరీంనగర్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
X

దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా అల్గునూర్ 8వ కార్పొరేషన్ పరిధిలో కరీంనగర్, హైదరాబాద్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న స్కూటర్ ను లారీ ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికి అక్కడే మృతి చెందాడు. టీఎస్ 07 యు హెచ్ 8967 గల లారీ, ఏపి 15 ఏఎక్స్ 5318గల స్కూటీని ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం లో మృతుడు కరీంనగర్ లోని అశోక్ నగర్ కి చెందిన యంసాని వెంకటేశం గా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకొన్న ఎల్ఎండీ ఎసై ప్రమోద్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed