ఇండియా మెడిసిన్‌పై బ్రెజిల్ అధ్యక్షుడు ప్రశంసలు

by  |
ఇండియా మెడిసిన్‌పై బ్రెజిల్ అధ్యక్షుడు ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్‌ తీవ్రత అగ్రరాజ్యమైన అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది. అయితే, బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సోనారో‌కు కూడ ఇటీవల కరోనా సోకిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో కరోనా నుంచి కోలుకున్న అతడు భారత్‌పై పరోక్షంగా ప్రశంసలు కురిపించారు. తాను ప్రతి రోజు హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ టాబ్లెట్ వేసుకున్నందునే త్వరగా కోలుకున్నానని చెప్పారు. కరోనా వైరస్ నివారణలో హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ మించింది మరొకటి లేదని చెప్పారు. దీనిపై విమర్శలు చేస్తున్న వారు ఇంతకు మించిన మందును చూయించాలని సవాల్ విసరడం గమనార్హం.



Next Story

Most Viewed