- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఓ యువతి తన తల్లికి రాసిన చివరి లేఖ కన్నీరు తెప్పిస్తోంది. తూర్పుగోదావరి సఖినేటిపల్లి మండలంలోని మోరిపోడు గ్రామంలో చోటుచేసుకున్న ఆత్మహత్య కలకలం రేపగా… ఆమె రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మోరిపోడు గ్రామానికి చెందిన యువతి ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆమె స్నానం చేస్తుండగా స్థానిక యువకుడు వీడియో తీశాడు. అప్పట్నుంచి ఆమెకు వేధింపులు ఆరంభమయ్యాయి. రూమ్కి రమ్మని పిలిచేవాడు. ఎంత వేధించాడో కానీ.. ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో తీవ్ర సంఘర్షణకు గురవుతూ సూసైడ్ నోట్ రాసింది. అందులో… అమ్మా!.. నేను ఏ తప్పూ చేయలేదు. నాకు బతకాలని ఉంది. కానీ వాడు బతకనివ్వట్లేదు. తన గదికి రావాలంటున్నాడు. రాకపోతే నా ఫొటోలు బయట పెడతానని బెదిరిస్తున్నాడు.
ఈ విషయం నీ ముఖంలోకి చూసి చెప్పే ధైర్యం నాకు లేదమ్మా. ఆ యువకుడిని ఏమీ చేయవద్దు. ఆ ఫొటోలు బయట పెట్టకపోవడం ద్వారానే నా ఆత్మకు శాంతి. ఐలవ్యూ అమ్మా. ఐ మిస్యూ అమ్మా అంటూ రాసింది. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువకుడు ఎవరు? అన్నది బయటపడలేదు. ఆమె రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.