- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,వెబ్డెస్క్ : జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. విమానాశ్రయంలో ఐదు నిమషాల వ్యవధిలోనే జంట పేలుళ్లు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ పేలుడు ధాటికి విమానాశ్రయం భవనం పైకప్పు ఎగిరిపడింది. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ పేలుళ్ల వలన ప్రాణనష్టమేమీ జరగలేదని అధికారులు తెలిపారు. కాగా బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని తనిఖీలు ప్రారంభిచాయి.
ఈ పేలుళ్లకు రెండు డ్రోన్లు ఉపయోగించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు విమానాశ్రయంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటన పై రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ ఆరోరాతో మాట్లాడి ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉన్నతాధికారుల ఆదేశంతో ఎయిర్ మార్షల్ విక్రమ్ సింగ్ జమ్ము వెళ్లనున్నారు.