జమ్ములో బాంబు పేలుళ్లు.. ఎగిరిపడిన విమానాశ్రయం పై కప్పు

by  |
జమ్ములో బాంబు పేలుళ్లు.. ఎగిరిపడిన విమానాశ్రయం పై కప్పు
X

దిశ,వెబ్‌డెస్క్ : జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. విమానాశ్రయంలో ఐదు నిమషాల వ్యవధిలోనే జంట పేలుళ్లు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ పేలుడు ధాటికి విమానాశ్రయం భవనం పైకప్పు ఎగిరిపడింది. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ పేలుళ్ల వలన ప్రాణనష్టమేమీ జరగలేదని అధికారులు తెలిపారు. కాగా బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని తనిఖీలు ప్రారంభిచాయి.

ఈ పేలుళ్లకు రెండు డ్రోన్లు ఉపయోగించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు విమానాశ్రయంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటన పై రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ ఆరోరాతో మాట్లాడి ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉన్నతాధికారుల ఆదేశంతో ఎయిర్ మార్షల్ విక్రమ్ సింగ్ జమ్ము వెళ్లనున్నారు.



Next Story

Most Viewed