నిందితుల కోసం వెళ్తే నాటు బాంబు పేలింది

by  |
నిందితుల కోసం వెళ్తే నాటు బాంబు పేలింది
X

దిశ, వెబ్‌డెస్క్: నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. ఓ ఇంట్లో తిష్టవేశారని తెలిసి దాడులు చేయగా ఒక్కసారిగా నాటు బాంబు పేలింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా తడలో వెలుగుచూసింది. తమిళనాడులో ఓ మర్డర్‌కు కేసుకు సంబంధించి నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు పోలీసులు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాంబు పేలుడు కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed