అలర్ట్.. ఖమ్మంలో బ్లాక్ ఫంగస్ కేసులు

by  |
అలర్ట్.. ఖమ్మంలో బ్లాక్ ఫంగస్ కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రజలు ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతుంటే.. తాజాగా బ్లాక్ ఫంగస్ మరింత టెన్షన్‌కు గురి చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా, అక్కడక్కడా కొద్ది మంది మృతి చెందుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసు నమోదు అయ్యింది. జిల్లాలోని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ కేసు వెలుగు చూసింది. ఇటీవల కరోనాతో చికిత్స పొంది ఇంటికి వెళ్లిన మహిళ.. కన్ను వాపుతో మళ్లీ ఆసుపత్రిలో చేరింది. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు బ్లాక్ ఫంగస్ సోకినట్టు నిర్ధారించారు.



Next Story