రేపు చలో జనగామ

by  |
రేపు చలో జనగామ
X

దిశ,వెబ్‌డెస్క్: రేపు చలో జనగామకు బీజేపీ పార్టీ పిలుపునిచ్చింది. జనగామ బీజేపీ అధ్యక్షుడు పవన్ శర్మపై లాఠీ చార్జ్‌కు నిరసనగా బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. సీఐ మల్లేశ్ పై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డెడ్ లైన్ విధించారు. లేదంటే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సంజయ్ వెల్లడించారు. కాగా జనగామ మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మపై సీఐ మల్లేశ్ లాఠీ చార్జీ చేసిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed