ఈటల ఇంట్లో బీజేపీ నేతల లంచ్..

by  |
tarun-chug
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ కారు దిగి కషాయ కండువా కప్పుకుంటున్నారని తెలిసినప్పటి నుంచి హుజురాబాద్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ వచ్చాయి. తాజాగా రేపు ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడటం, సెంట్రల్ నుంచి బీజేపీ జాతీయ నేతలు రావడం కూడా అంతా కమలం పార్టీ వ్యుహంలో భాగంగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 12న ఈటల రాజీనామా, 14న బీజేపీలో అఫీషియల్ జాయినింగ్ అని తేలిపోయింది.

ఆ తర్వాత ఎంటీ అన్నదాని గురించి చర్చించేందుకే జాతీయ నేతలు హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ కార్యాలయంలో మీటింగ్ అనంతరం ఈటల నివాసానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ సహా కమలదళ బృందం చేరుకుంది. ఈటల ఇంట్లో జాతీయ నేతలు లంచ్ చేయనున్నారు. అనంతరం భవిష్యత్ కార్యచరణ గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, బీజేపీలో ఈటలకు ఇవ్వబోయే ప్రాధాన్యతకు నిదర్శనమే ఈ సమావేశం అని కమలనాథులు చెబుతున్నారు.



Next Story