రేపటినుంచి నాగార్జున సాగర్‌‌లో బీజేపీ పాదయాత్ర

by  |
BJP
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీజేపీ శనివారం నుంచి పాదయాత్రలు నిర్వహించనుంది. ఎన్నికల సంఘం సాగర్ బై ఎలక్షన్స్‌కు షెడ్యూల్ ఖరారు చేయడంతో.. పాదయాత్రల ద్వారా ప్రజలను కలవాలని ఆ పార్టీ నిర్ణయించింది. ముందుగా పెద్దవూరు, త్రిపురారం, తిరుమలగిరి-సాగర్ మండలాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. రాష్ట్ర స్థాయి గిరిజన నేతలు పాదయాత్రలో పాల్గొననున్నారు. గిరిజన తండాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను కవర్ చేస్తూ పాదయాత్ర కొనసాగించనున్నారు. అయితే అనివార్య కారణాల రీత్యా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని బీజేపీ నేతలు చెప్పారు.

Next Story

Most Viewed