జగన్ తో సుబ్రహ్మణ్య స్వామి భేటీ.. స్టీల్ ప్లాంట్ పై కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సరికాదని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడాన్ని తాను వ్యతిరేకిస్తానని తెలిపారు. గతంలో ఎయిరిండియా ప్రైవేటీకరణను వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో పర్యటించిన ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధానిని కలిసేటప్పుడు తాను సీఎం జగన్ తో ప్రధానిని కలుస్తానని తెలిపారు. ఇకపోతే విశాఖ స్టీల్ [&hellip;]</p>

JAGAN SUBRAMANIAN SWAMY
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సరికాదని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడాన్ని తాను వ్యతిరేకిస్తానని తెలిపారు. గతంలో ఎయిరిండియా ప్రైవేటీకరణను వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో పర్యటించిన ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధానిని కలిసేటప్పుడు తాను సీఎం జగన్ తో ప్రధానిని కలుస్తానని తెలిపారు. ఇకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోదీకి రెండు సార్లు లేఖలు రాశారు. అపాయింట్మెంట్ ఇస్తే అఖిలపక్షంతో కలుస్తానని జగన్ లేఖలో ప్రస్తావించిన విషయం తెలిసిందే.

Next Story