చేతగాకపోతే రాజీనామా చేయి.. ధర్నాలు కాదు.. కేసీఆర్‌కు బీజేపీ ఎంపీ కౌంటర్

by  |
mp-arvind
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ధర్నాచౌక్ ఎత్తేసినోడు.. ఇప్పుడు ధర్నా చేస్తా అంటున్నడు’ అంటూ బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. శుక్రవారం తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ వీడియో అప్‌లోడ్ చేసిన ఆయన.. ‘ధర్నాలు చేయనికి నిన్ను ముఖ్యమంత్రిని చేయలే.. రైతుల మీద దాడిచేయించిన చరిత్ర నీది, నీ బిడ్డది.. నీ సోమరి తనం వల్ల తెలంగాణ రైతు గోస పడుతున్నడు.. చేత గాక పోతే రాజీనామ చేయి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Next Story

Most Viewed