ఇద్దరు దొంగలు కలిసి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకున్నారు

by  |
Rajasingh
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని ఇద్దరు దొంగలు కలిసి చేజిక్కించుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఇవాళ జీహెచ్ఎంసీ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. టీఆర్ఎస్‌కు ఎంఐఎం మద్ధతు తెలిపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. మేయర్ స్థానానికి పోటీ చేస్తామని చెప్పిన ఎంఐఎం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేసుంటే 15 సీట్లు కూడా వచ్చేవి కావన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం తమ బొంద తామే తొవ్వుకున్నాయని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

గ్రేటర్ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి


Next Story

Most Viewed