పోస్టల్ బ్యాలె‌ట్‌లో బీజేపీ ఆధిక్యం

by  |
పోస్టల్ బ్యాలె‌ట్‌లో బీజేపీ ఆధిక్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆసక్తిగా సాగుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. గ్రేటర్‌లో 1,926 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. వీటిల్లో బీజేపీకి మెజారిటీ వాటా దక్కింది. బీజేపీకి 515 పోస్టల్ ఓట్లు రాగా.. టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. అధికార పార్టీకి 281 పోస్టల్ ఓట్లు, ఎంఐఎంకు 50, కాంగ్రెస్‌కు 40, ఇతరులకు 20 ఓట్లు వచ్చాయి. ఎల్‌బీ నగర్ జోన్ లో బీజేపీ 118 పోస్టల్ ఓట్లతో పూర్తి ఆధిక్యతను ప్రదర్శించింది. చార్మినార్ జోన్‌లో బీజేపీకి 85 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ 25తో సరిపెట్టుకుంది. ఖైరతాబాద్‌లో బీజేపీకి 81, టీఆర్ఎస్‌కు 38, శేరిలింగంపల్లిలో బీజేపీకి 30, టీఆర్ఎస్‌కు 20, కూకట్ పల్లి జోన్‌లో బీజేపీకి 72, టీఆర్ఎస్‌కు 59 ఓట్లు దక్కాయి. మరిన్ని పోస్టల్ బ్యాలెట్ల వివరాలు రావాల్సి ఉంది.

Next Story

Most Viewed